నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన గంట్ల సుగుణమ్మ (85) శుక్రవారం ఉదయం 7.15 గంటలకు అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె గంట్ల రామ్ రెడ్డి సతీమణి. ఆమె మరణవార్తతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
మృతురాలి పార్థివ దేహానికి గ్రామ సర్పంచ్ కాటం వెంకన్న, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంట్ల రవీందర్, గంట్ల పుల్లారెడ్డి, సాగర్ల నాగరాజు, ఆనగంటి నరేష్, కుర్రు యాదయ్య తదితరులు వీడ్కోలు పలికారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి