Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

పత్తికొండలో జరగాల్సిన ఆదోని జిల్లా సాధన జేఏసి సమావేశం వాయిదా

పత్తికొండలో జరగాల్సిన ఆదోని జిల్లా సాధన జేఏసి సమావేశం వాయిదా

పత్తికొండలో జరగాల్సిన ఆదోని జిల్లా సాధన జేఏసి సమావేశం వాయిదా
07-01-2026 129 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనివార్య కారణాలతో శనివారానికి మార్పు – జనవరి 10న సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్‌లో నిర్వహణ

స్థానికం ప్రధాన ప్రతినిధి

పత్తికొండలో ఈరోజు జరగవలసిన ఆదోని జిల్లా సాధన జేఏసి రౌండ్ టేబుల్ సమావేశం అనివార్య కారణాల వల్ల శనివారానికి వాయిదా పడింది. ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా పత్తికొండ నియోజకవర్గంలో కార్యాచరణ రూపొందించేందుకు నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని జనవరి 10వ తేదీ శనివారం నాడు పత్తికొండలోని సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జేఏసి నాయకులు తెలిపారు.

ఈ సమావేశంలో పత్తికొండకు చెందిన వివిధ ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, కుల–మత సంఘాలు, వ్యాపార, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు నూర్ అహ్మద్, నరేంద్ర యాదవ్, అయ్యాళప్ప, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సుభాష్ మాదిగ, నాయకులు రవి, మాదాసి, మాదారి, కురువ సంఘం నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పత్తికొండలో జరగాల్సిన ఆదోని జిల్లా సాధన జేఏసి సమావేశం వాయిదా

Article Image

అనివార్య కారణాలతో శనివారానికి మార్పు – జనవరి 10న సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్‌లో నిర్వహణ

స్థానికం ప్రధాన ప్రతినిధి

పత్తికొండలో ఈరోజు జరగవలసిన ఆదోని జిల్లా సాధన జేఏసి రౌండ్ టేబుల్ సమావేశం అనివార్య కారణాల వల్ల శనివారానికి వాయిదా పడింది. ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా పత్తికొండ నియోజకవర్గంలో కార్యాచరణ రూపొందించేందుకు నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని జనవరి 10వ తేదీ శనివారం నాడు పత్తికొండలోని సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జేఏసి నాయకులు తెలిపారు.

ఈ సమావేశంలో పత్తికొండకు చెందిన వివిధ ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, కుల–మత సంఘాలు, వ్యాపార, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు నూర్ అహ్మద్, నరేంద్ర యాదవ్, అయ్యాళప్ప, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సుభాష్ మాదిగ, నాయకులు రవి, మాదాసి, మాదారి, కురువ సంఘం నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News