పత్తికొండలో జరగాల్సిన ఆదోని జిల్లా సాధన జేఏసి సమావేశం వాయిదా
పత్తికొండలో జరగాల్సిన ఆదోని జిల్లా సాధన జేఏసి సమావేశం వాయిదా
Editor Desk
అనివార్య కారణాలతో శనివారానికి మార్పు – జనవరి 10న సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్లో నిర్వహణ
స్థానికం ప్రధాన ప్రతినిధి
పత్తికొండలో ఈరోజు జరగవలసిన ఆదోని జిల్లా సాధన జేఏసి రౌండ్ టేబుల్ సమావేశం అనివార్య కారణాల వల్ల శనివారానికి వాయిదా పడింది. ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా పత్తికొండ నియోజకవర్గంలో కార్యాచరణ రూపొందించేందుకు నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని జనవరి 10వ తేదీ శనివారం నాడు పత్తికొండలోని సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు జేఏసి నాయకులు తెలిపారు.
ఈ సమావేశంలో పత్తికొండకు చెందిన వివిధ ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, కుల–మత సంఘాలు, వ్యాపార, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు నూర్ అహ్మద్, నరేంద్ర యాదవ్, అయ్యాళప్ప, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సుభాష్ మాదిగ, నాయకులు రవి, మాదాసి, మాదారి, కురువ సంఘం నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి