పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు నిరంకుశమైనవి! డి హరినాథ్
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు నిరంకుశమైనవి! డి హరినాథ్
GADDAM JAGANMOHAN REDDY
విద్యా సంవత్సరంలో మినిమం 220 రోజుల పని దినాలు ఉండాలనే నిబంధనకు మించి అదనంగా స్కూళ్లు తెరిపించటం విద్యాశాఖ అధికారి విజయరామరాజు,విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మెప్పు పొందటానికేనని ఇది నిరంకుశమైన ఆదేశమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుడి హరినాథ్ విమర్శించారు.
ఎన్టీఆర్ జిల్లాలో220 పని దినములు ఉండగా రెండవ శనివారం పాఠశాలలను నడపాలని డీఈవోల మీద పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒత్తిడి తీసుకురావడం సరికాదని హరినాథ్ అన్నారు. డీఈవోల అధికారాలను కూడా హరించే విధంగా విద్యాశాఖ అధికారి వైఖరి ఉందన్నారు. స్థానికంగా వచ్చే పండుగలకు సెలవు మంజూరు చేసే అధికారం స్థానిక హెడ్మాస్టర్ కే ఉండేదని ,నేడు దాన్ని కూడా తొలగించారని, ఆప్షనల్ హాలిడే ఇచ్చే హక్కు మండల ఎడ్యుకేషన్ అధికారినుండి తొలగించారని. సర్వం డైరెక్టర్ విజయరామరాజు దయాదాక్షిణ్యాల మీద విద్యాశాఖను నియంత్రించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఈ విధానాలను వ్యతిరేకించవలసిందిగా ఉపాధ్యాయ వర్గాలను డి హరినాథ్ కోరారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి