Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:36 AM

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం సర్పంచ్ కాటం వెంకటేశం

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం సర్పంచ్ కాటం వెంకటేశం

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం సర్పంచ్ కాటం వెంకటేశం
February 05, 2026 07:33 PM 216 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకాపర్తి జెడ్పిహెచ్ఎస్‌లో విద్యార్థుల సౌకర్యానికి దాత

గ్రామీణ పాఠశాల అభివృద్ధికి ఆదర్శ సేవ

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రశంసనీయ కార్యక్రమం జరిగింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సౌకర్యంగా కూర్చునేందుకు దాత కామినేని దుర్గాకుమార్ బెంచీలను విరాళంగా అందజేశారు. ఈ విరాళం విలువ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలుగా ఉంది.

పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ సేవకు గుర్తింపుగా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచి కాటం వెంకటేశం కామినేని దుర్గాకుమార్‌ను ఘనంగా సన్మానించారు. విద్యా రంగంలో ఇలాంటి దాతల సహకారం అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు దాతను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేసిన ఈ సేవ ఆదర్శంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కందిమల్ల శివారెడ్డి, తాటి చంద్రమౌళి, ఉపసర్పంచి ఓర్సు సైదులు, ఏర్పు నరసింహ, ఏర్పుల యాదయ్య, సాగర్ల నవ్య శ్రీ, నాగరాజు, గంటల కవిత, తిరుమల్ రెడ్డి, తెలుసూరి నరసింహ, ఆనగంటి పూజ, నరేష్, నీలకంఠం, విజయ లింగస్వామి, మల్లేశ్వరి, వెంకటేశం, చేకూరి గణేష్, కృష్ణవేణి, జిల్లా ప్రశాంత్, మర్రి హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వచ్చే దాతల వల్ల గ్రామీణ ప్రాంతాల పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News