Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:21 PM

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం సర్పంచ్ కాటం వెంకటేశం

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం సర్పంచ్ కాటం వెంకటేశం

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం సర్పంచ్ కాటం వెంకటేశం
February 05, 2026 07:33 PM 212 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకాపర్తి జెడ్పిహెచ్ఎస్‌లో విద్యార్థుల సౌకర్యానికి దాత

గ్రామీణ పాఠశాల అభివృద్ధికి ఆదర్శ సేవ

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రశంసనీయ కార్యక్రమం జరిగింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సౌకర్యంగా కూర్చునేందుకు దాత కామినేని దుర్గాకుమార్ బెంచీలను విరాళంగా అందజేశారు. ఈ విరాళం విలువ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలుగా ఉంది.

పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ సేవకు గుర్తింపుగా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచి కాటం వెంకటేశం కామినేని దుర్గాకుమార్‌ను ఘనంగా సన్మానించారు. విద్యా రంగంలో ఇలాంటి దాతల సహకారం అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు దాతను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేసిన ఈ సేవ ఆదర్శంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కందిమల్ల శివారెడ్డి, తాటి చంద్రమౌళి, ఉపసర్పంచి ఓర్సు సైదులు, ఏర్పు నరసింహ, ఏర్పుల యాదయ్య, సాగర్ల నవ్య శ్రీ, నాగరాజు, గంటల కవిత, తిరుమల్ రెడ్డి, తెలుసూరి నరసింహ, ఆనగంటి పూజ, నరేష్, నీలకంఠం, విజయ లింగస్వామి, మల్లేశ్వరి, వెంకటేశం, చేకూరి గణేష్, కృష్ణవేణి, జిల్లా ప్రశాంత్, మర్రి హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వచ్చే దాతల వల్ల గ్రామీణ ప్రాంతాల పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News