PRINT TIME: July 11, 2026 12:33 AM
ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
April 22, 2026 08:11 AM
62 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
బెంగళూరు: ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. ప్రియుడిపై అనుమానంతో ఓ యువతి అతన్ని కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన ఘటన నగర శివారు అంజనానగర్లో చోటుచేసుకుంది.
తుమకూరుకు చెందిన కిరణ్ (27) మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అదే చోట పనిచేస్తున్న ప్రేమ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోకపోవచ్చనే అనుమానంతో ప్రేమ ఆగ్రహానికి గురైంది.
మంగళవారం కిరణ్ను ఇంటికి పిలిచిన ఆమె, ‘లవ్ ప్రపోజల్’ పేరుతో కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసింది. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి