పరీక్షలే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదవాలి – జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ
పరీక్షలే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదవాలి – జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ
స్థానికం బృందం
రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ముందస్తు ప్రణాళికతో కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ సూచించారు.శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా రెవెన్యూ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేకంగా వెనుకబడిన విద్యార్థులతో సమావేశమై రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. వెనుకబడిన విషయాలను ప్రతిరోజు ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేయాలని, కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రోత్సహించారు.విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై మరింత దృష్టి సారించి ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నాhరు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి