Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:21 PM

పరీక్షల విజయానికి పదెనిమిది సూత్రాలు – విద్యార్థులకు దిశానిర్దేశం.ఏనుగు నరసింహారెడ్డి

పరీక్షల విజయానికి పదెనిమిది సూత్రాలు – విద్యార్థులకు దిశానిర్దేశం.ఏనుగు నరసింహారెడ్డి

పరీక్షల విజయానికి పదెనిమిది సూత్రాలు – విద్యార్థులకు దిశానిర్దేశం.ఏనుగు నరసింహారెడ్డి
February 05, 2026 07:40 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ఫిబ్రవరి 5:

ప్రముఖ బాల వైద్యుడు, మనోవైద్య నిపుణుడు, ప్రేరణాత్మక రచయిత డా. గుండ్లూరు సురేంద్రబాబు రచించిన “పరీక్షల్లో విజయం కోసం పదెనిమిది సూత్రాలు” అనే గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం నాంపల్లి లోని ఎస్పీఆర్ తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ భాషా–సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి గ్రంథాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పరిరక్షణలో ఈ గ్రంథం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ అప్పాల ప్రసాద్ జీ, ప్రాచీన భారతీయ ఆత్మనియంత్రణ పద్ధతులు, ఒత్తిడి నియంత్రణ, ఏకాగ్రత పెంపొందించే మార్గాలు, భావోద్వేగ సమతుల్యతపై చేసిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది.శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ, ఈ గ్రంథం విద్యార్థులకు ఆచరణాత్మక మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణ మనోవైద్యుల సంఘం ఉపాధ్యక్షులు డా. ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రచయిత ఒక వైద్యుడిగా ఎంతో శ్రమించి సరళమైనా శక్తివంతమైన పదెనిమిది సూత్రాలను ఈ గ్రంథం ద్వారా అందించారని తెలిపారు. ఇవి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా మార్గనిర్దేశకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇటీవల గణాంకాల ప్రకారం విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఈ గ్రంథం ధైర్యం, ఆశ, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించగలదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా డా. వి. త్రివేణి, డా. పెద్దింటి అశోక్ కుమార్, డా. శ్రీభాష్యం శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. హయత్‌నగర్ గ్రంథపాలకులు డా. దుర్గాప్రసాద్ హాజరై రచయితకు అభినందనలు తెలిపారు. స్వాగతం మరియు కృతజ్ఞతలను శ్రీమతి కె. విజయలక్ష్మి తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News