పరీక్షల విజయానికి పదెనిమిది సూత్రాలు – విద్యార్థులకు దిశానిర్దేశం.ఏనుగు నరసింహారెడ్డి
పరీక్షల విజయానికి పదెనిమిది సూత్రాలు – విద్యార్థులకు దిశానిర్దేశం.ఏనుగు నరసింహారెడ్డి
స్థానికం బృందం
హైదరాబాద్, ఫిబ్రవరి 5:
ప్రముఖ బాల వైద్యుడు, మనోవైద్య నిపుణుడు, ప్రేరణాత్మక రచయిత డా. గుండ్లూరు సురేంద్రబాబు రచించిన “పరీక్షల్లో విజయం కోసం పదెనిమిది సూత్రాలు” అనే గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం నాంపల్లి లోని ఎస్పీఆర్ తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ భాషా–సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి గ్రంథాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పరిరక్షణలో ఈ గ్రంథం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ అప్పాల ప్రసాద్ జీ, ప్రాచీన భారతీయ ఆత్మనియంత్రణ పద్ధతులు, ఒత్తిడి నియంత్రణ, ఏకాగ్రత పెంపొందించే మార్గాలు, భావోద్వేగ సమతుల్యతపై చేసిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది.శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ, ఈ గ్రంథం విద్యార్థులకు ఆచరణాత్మక మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణ మనోవైద్యుల సంఘం ఉపాధ్యక్షులు డా. ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రచయిత ఒక వైద్యుడిగా ఎంతో శ్రమించి సరళమైనా శక్తివంతమైన పదెనిమిది సూత్రాలను ఈ గ్రంథం ద్వారా అందించారని తెలిపారు. ఇవి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా మార్గనిర్దేశకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇటీవల గణాంకాల ప్రకారం విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఈ గ్రంథం ధైర్యం, ఆశ, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించగలదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా డా. వి. త్రివేణి, డా. పెద్దింటి అశోక్ కుమార్, డా. శ్రీభాష్యం శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. హయత్నగర్ గ్రంథపాలకులు డా. దుర్గాప్రసాద్ హాజరై రచయితకు అభినందనలు తెలిపారు. స్వాగతం మరియు కృతజ్ఞతలను శ్రీమతి కె. విజయలక్ష్మి తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి