Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:33 AM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
February 05, 2026 05:25 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చెట్టును కాపాడితే భవిష్యత్తు భద్రం

పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటడమే కాదని, జీవన విధానాన్ని ప్రకృతికి అనుకూలంగా మార్చుకోవడమే అసలైన పరిరక్షణ అని ప్రముఖ పర్యావరణ వేత్త సురేష్ గుప్త స్పష్టం చేశారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎకో క్లబ్, వృక్షశాస్త్ర విభాగం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘తల్లి చెట్టు’ పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించకుండా పర్యావరణ రక్షణ నినాదాలు చేయడం ప్రయోజనం లేదన్నారు. ఆహార అలవాట్లు, దుస్తులు, నివాస విధానాలు అన్నీ పర్యావరణహితంగా ఉండాలని, ఆ దిశగా విద్యార్థులు ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. చెట్లు లేకపోతే మనిషి మనుగడ లేదని, చెట్టును కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ఆయన స్పష్టం చేశారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, కళాశాల విద్య కమిషనర్ ఆదేశాలు, గ్రీన్ విప్లవ మండలితో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత పుడమిని అందించాలంటే చెట్ల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. కళాశాల ప్రాంగణంలోని అత్యంత పురాతన చెట్టును ‘తల్లి చెట్టుగా’ గుర్తించి పూజించడం విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంచుతుందని పేర్కొన్నారు.

అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు, ఎకో క్లబ్ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News