Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:19 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
February 05, 2026 05:25 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చెట్టును కాపాడితే భవిష్యత్తు భద్రం

పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటడమే కాదని, జీవన విధానాన్ని ప్రకృతికి అనుకూలంగా మార్చుకోవడమే అసలైన పరిరక్షణ అని ప్రముఖ పర్యావరణ వేత్త సురేష్ గుప్త స్పష్టం చేశారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎకో క్లబ్, వృక్షశాస్త్ర విభాగం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘తల్లి చెట్టు’ పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించకుండా పర్యావరణ రక్షణ నినాదాలు చేయడం ప్రయోజనం లేదన్నారు. ఆహార అలవాట్లు, దుస్తులు, నివాస విధానాలు అన్నీ పర్యావరణహితంగా ఉండాలని, ఆ దిశగా విద్యార్థులు ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. చెట్లు లేకపోతే మనిషి మనుగడ లేదని, చెట్టును కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ఆయన స్పష్టం చేశారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, కళాశాల విద్య కమిషనర్ ఆదేశాలు, గ్రీన్ విప్లవ మండలితో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత పుడమిని అందించాలంటే చెట్ల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. కళాశాల ప్రాంగణంలోని అత్యంత పురాతన చెట్టును ‘తల్లి చెట్టుగా’ గుర్తించి పూజించడం విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంచుతుందని పేర్కొన్నారు.

అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు, ఎకో క్లబ్ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News