Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 12:56 AM

పర్యాటక మాస్టర్ ప్రణాళికకు వేగం.అదనపు కలెక్టర్ భాస్కరరావు

పర్యాటక మాస్టర్ ప్రణాళికకు వేగం.అదనపు కలెక్టర్ భాస్కరరావు

పర్యాటక మాస్టర్ ప్రణాళికకు వేగం.అదనపు కలెక్టర్ భాస్కరరావు
February 24, 2026 04:35 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కీలక ప్రాంతాల అభివృద్ధికి రెండు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

జిల్లాలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు ముమ్మరమయ్యాయి. పర్యాటక మాస్టర్ ప్రణాళిక తయారీలో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రెండు రోజులలోపే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన రాచకొండ కోట, భువనగిరి కోట, మహదేవ్‌పూర్‌, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కొలనుపాక జైన దేవాలయం, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తదితర ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.

పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఎం/ఎస్ వోయంట్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించనుందని వెల్లడించారు.

సమావేశంలో పర్యాటక అధికారి ధనంజనేయులు, సహాయ సంచాలకుడు ఓంప్రకాశ్, రామమూర్తి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News