నూతన వధూవరులను ఆశీర్వదించిన కందాళ ఉపేందర్ రెడ్డి
కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామానికి చెందిన పందిరి దామోదర్ రెడ్డి – సునీతల కుమారుడు ప్రవీణ్ రెడ్డి, సుదీక్షల వివాహం ఘనంగా జరిగింది.మోతె మండలం చెన్నకేశవపురం కూడలి సమీపంలోని స్వస్తిక్ గార్డెన్స్ వేడుక మందిరంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుక ఆనందోత్సాహాలతో కొనసాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి