Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!
13-04-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర స్థాయి ర్యాంకర్ కు రూ. 10,000 ఆర్థిక సాయం

మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

కృషి ఉంటే విద్యార్థులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారని, అపార ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహాశ్రీని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నేహాశ్రీ 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన విద్యార్థినిని ప్రోత్సహించే ఉద్దేశంతో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ముందుకు వచ్చారు. చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా నేహాశ్రీకి రూ. 10,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధించడం గర్వకారణమని, నేహాశ్రీ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రతినిధులు, విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!

Article Image

రాష్ట్ర స్థాయి ర్యాంకర్ కు రూ. 10,000 ఆర్థిక సాయం

మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

కృషి ఉంటే విద్యార్థులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారని, అపార ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహాశ్రీని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నేహాశ్రీ 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన విద్యార్థినిని ప్రోత్సహించే ఉద్దేశంతో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ముందుకు వచ్చారు. చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా నేహాశ్రీకి రూ. 10,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధించడం గర్వకారణమని, నేహాశ్రీ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రతినిధులు, విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News