Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 11:23 AM

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!
April 13, 2026 08:42 PM 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర స్థాయి ర్యాంకర్ కు రూ. 10,000 ఆర్థిక సాయం

మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

కృషి ఉంటే విద్యార్థులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారని, అపార ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహాశ్రీని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నేహాశ్రీ 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన విద్యార్థినిని ప్రోత్సహించే ఉద్దేశంతో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ముందుకు వచ్చారు. చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా నేహాశ్రీకి రూ. 10,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధించడం గర్వకారణమని, నేహాశ్రీ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రతినిధులు, విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News