Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన హెచ్చరికలు – పోలీసులు కౌన్సిలింగ్ కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 10:13 PM

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!
April 13, 2026 08:42 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర స్థాయి ర్యాంకర్ కు రూ. 10,000 ఆర్థిక సాయం

మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

కృషి ఉంటే విద్యార్థులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారని, అపార ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహాశ్రీని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నేహాశ్రీ 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన విద్యార్థినిని ప్రోత్సహించే ఉద్దేశంతో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ముందుకు వచ్చారు. చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా నేహాశ్రీకి రూ. 10,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధించడం గర్వకారణమని, నేహాశ్రీ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రతినిధులు, విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News