Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:55 AM

ప్రశాంత్ నగర్‌లో కార్పొరేటర్ మార్నింగ్ వాక్, కాలనీ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన

ప్రశాంత్ నగర్‌లో కార్పొరేటర్ మార్నింగ్ వాక్, కాలనీ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన

ప్రశాంత్ నగర్‌లో కార్పొరేటర్ మార్నింగ్ వాక్, కాలనీ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన
February 05, 2026 07:18 AM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం డిప్యూటీ కమిషనర్ వంశీ కృష్ణతో కలిసి ప్రశాంత్ నగర్ కాలనీలో ఉదయపు నడకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, హుడా పార్క్ పరిస్థితి తదితర సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.కాలనీ వాసులు కార్పొరేటర్‌కు తమ సమస్యలను నేరుగా వివరించారు. ముఖ్యంగా రహదారులు చెదిరిపోయి ప్రమాదకరంగా మారాయని, సరైన డ్రైనేజీ లేక మురుగు నీరు నిలిచిపోతుందని, హుడా పార్క్ అభివృద్ధి అవసరమై ఉందని తెలిపారు. వీధి కుక్కల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా వారు దృష్టికి తీసుకొచ్చారు.ఈ సమస్యలపై కార్పొరేటర్ సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు, ఇంజనీర్ నాగేందర్, డీఈ కనకాయ, వాటర్ వర్క్స్ ఏఈ సాయి శ్రీనివాస్, ఏఎంహెచ్ఓ నీలిమ, ఎలక్ట్రికల్ డీఈ పవని, ఏఈ విఘ్నేశ్వరి, వర్క్ ఇన్‌స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.అలాగే ప్రశాంత్ నగర్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి యూవీఎన్ బాబు, అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగా రెడ్డి, మల్లికార్జున్ నగర్ అధ్యక్షుడు నర్సి రెడ్డి, క్రిస్టిన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, బాలాజీ నాథ్, నరసింహ రెడ్డి, గోవర్ధన్, అంజయ, రవికాంత్, డీజేఎం రెడ్డి, శ్రీధర్ గౌడ్ తదితర ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ నివాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News