Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:21 AM

ప్రజాసంబంధాల రంగాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేథస్సు వివేకంతో వినియోగించకపోతే విశ్వసనీయత దెబ్బతింటుంది – టి. శ్రీకర్ రెడ్డి

ప్రజాసంబంధాల రంగాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేథస్సు వివేకంతో వినియోగించకపోతే విశ్వసనీయత దెబ్బతింటుంది – టి. శ్రీకర్ రెడ్డి

ప్రజాసంబంధాల రంగాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేథస్సు వివేకంతో వినియోగించకపోతే విశ్వసనీయత దెబ్బతింటుంది – టి. శ్రీకర్ రెడ్డి
January 30, 2026 06:12 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాసంబంధాలు, పాత్రికేయ వృత్తి నిర్వహణలో కృత్రిమ మేథస్సు కీలక పాత్ర పోషిస్తూ సంప్రదాయ విధానాలను మార్చేస్తోందని పీఆర్ సూత్ర వ్యవస్థాపకులు టి. శ్రీకర్ రెడ్డి పేర్కొన్నారు. వేగం, సౌలభ్యం పెరిగినప్పటికీ నమ్మకం, మానవ ధృవీకరణ లేకుండా సాంకేతికత ప్రయోజనం పరిమితమేనని ఆయన స్పష్టం చేశారు.డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రజా సంబంధాలు – కృత్రిమ మేథస్సు” వెబినార్‌లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు.ముద్రిత, దృశ్య, డిజిటల్ మాధ్యమాలు, సామాజిక వేదికల కోసం సమాచార ప్రసారం, ప్రకటనల రూపకల్పనలో కృత్రిమ మేథస్సు కీలక సాధనంగా మారిందన్నారు. పీఆర్ నిపుణులు తక్కువ సమయంలో ఆకర్షణీయమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఏఐ తోడ్పడుతోందని తెలిపారు.అయితే డేటా గోప్యత, వాస్తవ ధృవీకరణ, నైతిక బాధ్యతలను విస్మరించరాదని హెచ్చరించారు. ఏఐ సామర్థ్యాలకంటే నమ్మకమే పీఆర్ రంగానికి అసలైన మూలధనమని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న మీడియా వాతావరణానికి అనుగుణంగా నైపుణ్యాలను పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ పల్లవి కబ్డే మాట్లాడుతూ, కృత్రిమ మేథస్సు మీడియా, ప్రకటనలు, ప్రజాసంబంధాల రంగాల్లో గణనీయమైన మార్పులకు దారితీస్తోందన్నారు. జర్నలిజం పని తీరులోనూ విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు.ఈ వెబినార్‌లో కన్వీనర్ డా. సునీల్ కుమార్ పోతన, సహ కన్వీనర్ డా. యాదగిరి కంభంపాటి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News