ప్రజలకు ప్రభుత్వానికి వారధి_ బిజెపి జనతా వారధి మీ సమస్య మా బాధ్యత బుర్రి శ్రీకర్
ప్రజలకు ప్రభుత్వానికి వారధి_ బిజెపి జనతా వారధి మీ సమస్య మా బాధ్యత బుర్రి శ్రీకర్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని అదే ప్రజలకు ప్రభుత్వానికి వారిధి బిజెపి జనతా వారధని, ఈ కార్యక్రమం జనవరి 5న ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ ల కార్యాలయం నందు అధికారికంగా ప్రారంభించబడినదని, ఈ కార్యక్రమం బూత్, గ్రామ స్థాయి కార్యకర్త నుండి మండల, జిల్లా, రాష్ట్ర ,జాతీయ స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని అధికారులకు, ఫిర్యాదుదారులకు మధ్య వారధిగా నిలవాలని ,సమస్యను బట్టి ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో ,పోలీస్ స్టేషన్, మరియు హాస్పిటల్స్ వంటి కార్యా లయల యందు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో విజయవాడ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ నందు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న సమక్షంలో ఏలూరు జిల్లా జనతా వారధి కార్యక్రమం కన్వీనర్ లగడపాటి సత్యనారాయణ, కుర్రా సుబ్బారావు, దళిత మోర్చా అధ్యక్షులు బిజెపి ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు నెరసు నెల రాజు పాల్గొనడం జరిగిందని, ప్రతి సోమవారం జనతా వారధి కార్యక్రమంలో ఇవ్వవలసినటువంటి ప్రజా వినతి పత్రాలను భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి గురు, శుక్రు ,శని ,వారాలు ప్రజల దగ్గర సమస్యలను తెలుసుకొని సమస్యకు సంబంధించిన దరఖాస్తులను పూర్తి చేసి దరఖాస్తుదారున్ని సోమవారం అధికారులు దగ్గరకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, చాట్రాయి మండలంలోని ప్రజలందరూ వారి సమస్యలను కుల, మత,వర్గ, పార్టీ తారతమ్యాలు లేకుండా క్షేత్రస్థాయిలో మండల బిజెపి నాయకులకు సమస్యలను దరఖాస్తు రూపంలో ఇచ్చిన ఎడల మీ సమస్య మా బాధ్యత గా భావించి సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ చాట్రాయి మండల కేంద్రంలో సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి ఇల్లు బిజెపి" ఆఫీస్ "దగ్గర ప్రతి శనివారం మరియు చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు శ్రీకర్ (9912449030,8688742685 )ప్రతి ఆదివారం దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి