Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:30 PM

ప్రజలకు ప్రభుత్వానికి వారధి_ బిజెపి జనతా వారధి మీ సమస్య మా బాధ్యత బుర్రి శ్రీకర్

ప్రజలకు ప్రభుత్వానికి వారధి_ బిజెపి జనతా వారధి మీ సమస్య మా బాధ్యత బుర్రి శ్రీకర్

ప్రజలకు ప్రభుత్వానికి వారధి_ బిజెపి జనతా వారధి మీ సమస్య మా బాధ్యత బుర్రి శ్రీకర్
January 07, 2026 07:47 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని అదే ప్రజలకు ప్రభుత్వానికి వారిధి బిజెపి జనతా వారధని, ఈ కార్యక్రమం జనవరి 5న ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ ల కార్యాలయం నందు అధికారికంగా ప్రారంభించబడినదని, ఈ కార్యక్రమం బూత్, గ్రామ స్థాయి కార్యకర్త నుండి మండల, జిల్లా, రాష్ట్ర ,జాతీయ స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని అధికారులకు, ఫిర్యాదుదారులకు మధ్య వారధిగా నిలవాలని ,సమస్యను బట్టి ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో ,పోలీస్ స్టేషన్, మరియు హాస్పిటల్స్ వంటి కార్యా లయల యందు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో విజయవాడ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ నందు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న సమక్షంలో ఏలూరు జిల్లా జనతా వారధి కార్యక్రమం కన్వీనర్ లగడపాటి సత్యనారాయణ, కుర్రా సుబ్బారావు, దళిత మోర్చా అధ్యక్షులు బిజెపి ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు నెరసు నెల రాజు పాల్గొనడం జరిగిందని, ప్రతి సోమవారం జనతా వారధి కార్యక్రమంలో ఇవ్వవలసినటువంటి ప్రజా వినతి పత్రాలను భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి గురు, శుక్రు ,శని ,వారాలు ప్రజల దగ్గర సమస్యలను తెలుసుకొని సమస్యకు సంబంధించిన దరఖాస్తులను పూర్తి చేసి దరఖాస్తుదారున్ని సోమవారం అధికారులు దగ్గరకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, చాట్రాయి మండలంలోని ప్రజలందరూ వారి సమస్యలను కుల, మత,వర్గ, పార్టీ తారతమ్యాలు లేకుండా క్షేత్రస్థాయిలో మండల బిజెపి నాయకులకు సమస్యలను దరఖాస్తు రూపంలో ఇచ్చిన ఎడల మీ సమస్య మా బాధ్యత గా భావించి సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ చాట్రాయి మండల కేంద్రంలో సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి ఇల్లు బిజెపి" ఆఫీస్ "దగ్గర ప్రతి శనివారం మరియు చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు శ్రీకర్ (9912449030,8688742685 )ప్రతి ఆదివారం దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News