సమాజంలో ప్రతి ఒక్కరి హక్కులను పరిరక్షిస్తూ, అన్యాయానికి గురయ్యే వారికి అండగా నిలవడమే లక్ష్యంగా హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీని స్థాపించినట్లు సంస్థ ఫౌండర్, చైర్మన్ కాకర్ల సరస్వతి తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ స్వచ్ఛంద సంస్థల్లో రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకున్నానని, అదే అనుభవంతో ప్రజల కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం లభించేలా కృషి చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం, బాధితులకు అండగా నిలవడం, ప్రజల్లో హక్కులపై అవగాహన కల్పించడం సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రజల హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఐకమత్యంతో పనిచేస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని, సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి అందరూ భాగస్వాములు కావాలని కాకర్ల సరస్వతి కోరారు.
ప్రజల హక్కులకు అండగా హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీ
ప్రజల హక్కులకు అండగా హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీ
Krishna
సమాజంలో ప్రతి ఒక్కరి హక్కులను పరిరక్షిస్తూ, అన్యాయానికి గురయ్యే వారికి అండగా నిలవడమే లక్ష్యంగా హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీని స్థాపించినట్లు సంస్థ ఫౌండర్, చైర్మన్ కాకర్ల సరస్వతి తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ స్వచ్ఛంద సంస్థల్లో రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకున్నానని, అదే అనుభవంతో ప్రజల కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం లభించేలా కృషి చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం, బాధితులకు అండగా నిలవడం, ప్రజల్లో హక్కులపై అవగాహన కల్పించడం సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రజల హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఐకమత్యంతో పనిచేస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని, సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి అందరూ భాగస్వాములు కావాలని కాకర్ల సరస్వతి కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి