Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:22 PM

పారదర్శక మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఆదేశాలు.రాణి కుముదిని

పారదర్శక మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఆదేశాలు.రాణి కుముదిని

పారదర్శక మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఆదేశాలు.రాణి కుముదిని
February 06, 2026 08:10 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పూర్తి పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా రాజీపడే పరిస్థితి ఉండకూడదని, చిన్న తప్పిదానికీ తావివ్వకుండా అధికారులు


అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో కమిషనర్ సమీక్షించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా అవసరమని పేర్కొన్నారు. అక్రమ మద్యం, నగదు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.రాష్ట్ర డీఐజీ మహేష్ భగవత్ ఎన్నికల వేళ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావులేకుండా ప్రత్యేక బృందాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, సమస్యాత్మక ప్రాంతాల్లో బలమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీల పరిధిలో 104 వార్డులకు 212 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు జిల్లా అధికారులు వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News