ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు రామన్నపేటలో ఘన సన్మానం.
ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు రామన్నపేటలో ఘన సన్మానం.
Editor Desk
ప్రభుత్వ విప్గా నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం రామన్నపేట మండల కేంద్రానికి తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు గజమాల వేసి, శాలువాతో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వేముల వీరేశం ప్రభుత్వ విప్గా నియమితులవడం నియోజకవర్గానికి గౌరవకారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, కొమ్మాయిగూడెం సర్పంచ్ మల్లారెడ్డి, రామన్నపేట ఉప సర్పంచ్ మోటె రమేష్, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, గొరిగే శేఖర్, బండ లింగస్వామి, ఎండీ అంజాద్, నోముల అనిత యాదయ్య, హరిబాబు, స్థంభాల వెంకన్న, బొడ్డు సాలయ్య, జెల్లా వెంకటేశం, ఎండీ నాసర్, వనం చంద్రశేఖర్, గోదాస్ పృద్వి, ఎండీ అక్రమ్, ఎండీ రెహాన్, గోదాసు శ్రీమన్నారాయణ, కొమ్ము నాగరాజు, ఆముద లక్ష్మణ్, కైరంకొండ నందకుమార్, ఎండీ రిజ్వాన్, కొమ్ము రాజు, ఎండీ జానీ, గంగాపురం శంకర్, లవణం సాయి తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి