ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యం–ఆహారంపై అవగాహన సదస్సు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యం–ఆహారంపై అవగాహన సదస్సు
స్థానికం బృందం
రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెల్నెస్ & లైఫ్ స్టైల్ కోచ్ కుమారి బ్లెస్సి రోజ్ ఆధ్వర్యంలో ఆరోగ్యం, ఆహార అలవాట్లు, పోషక విలువలు అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జగదీష్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో మెలగాలని, తద్వారా మంచి విద్యా ఉత్తీర్ణతలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఆరోగ్యం, విద్య రెండూ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని ఆయన తెలిపారు.సదస్సులో కోచ్ బ్లెస్సి రోజ్ విద్యార్థులకు రోజువారీ ఆహారంలో ఉండాల్సిన పోషక విలువలు, సమతుల్య ఆహారం ప్రాధాన్యత, జీవనశైలి మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. ఆరోగ్యకరమైన అలవాట్లు భవిష్యత్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాలే వెంకటరెడ్డి, మందడి వెంకట రెడ్డి, నరసింహ రావు, కొత్త నాగేష్, లైబ్రేరియన్ జానయ్య, అధ్యాపకులు కవిత, రాజేశ్వరి, ఉమారాణి, అలాగే అశోక్ రెడ్డి, శ్రవణ్, పరశురామ్, ల్యాబ్ అటెండెంట్ యాదయ్య పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి