Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:39 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం

ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం

ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం
31-01-2026 191 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, క్రీడోత్సవం, వీడ్కోలు వేడుకలు పట్టణంలోని జీఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ గరిక సత్యనారాయణ, తహసిల్దార్ సి. లాల్ బహదూర్, పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగరాజు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ బుంగ సంజీవ్ కూడా హాజరయ్యారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు సభను ఉత్సాహభరితంగా మార్చాయి. ఈ సందర్భంగా వెల్లంకి వాస్తవ్యులు లక్ష్మీ మురళీధర్ కళాశాలకు యాభైవేల రూపాయల విలువైన కుర్చీలను విరాళంగా అందించారు.

ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్న అధ్యాపకుడు కె. పరమేష్‌ను కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రసూనాదేవి, పున్నారావు, మాలె వెంకట్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్, నగేష్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జానయ్య, జి. వెంకటేశ్వరరావు, శ్రవణ్, పరశురాములు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, నరసయ్య, యాదయ్య, వెంకటయ్య తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం

Article Image

రామన్నపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, క్రీడోత్సవం, వీడ్కోలు వేడుకలు పట్టణంలోని జీఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ గరిక సత్యనారాయణ, తహసిల్దార్ సి. లాల్ బహదూర్, పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగరాజు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ బుంగ సంజీవ్ కూడా హాజరయ్యారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు సభను ఉత్సాహభరితంగా మార్చాయి. ఈ సందర్భంగా వెల్లంకి వాస్తవ్యులు లక్ష్మీ మురళీధర్ కళాశాలకు యాభైవేల రూపాయల విలువైన కుర్చీలను విరాళంగా అందించారు.

ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్న అధ్యాపకుడు కె. పరమేష్‌ను కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రసూనాదేవి, పున్నారావు, మాలె వెంకట్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్, నగేష్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జానయ్య, జి. వెంకటేశ్వరరావు, శ్రవణ్, పరశురాములు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, నరసయ్య, యాదయ్య, వెంకటయ్య తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News