ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం
ప్రభుత్వ జూనియర్ కళాశాల వేడుకలు వైభవం
స్థానికం బృందం
రామన్నపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, క్రీడోత్సవం, వీడ్కోలు వేడుకలు పట్టణంలోని జీఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ గరిక సత్యనారాయణ, తహసిల్దార్ సి. లాల్ బహదూర్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ డి. నాగరాజు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ బుంగ సంజీవ్ కూడా హాజరయ్యారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు సభను ఉత్సాహభరితంగా మార్చాయి. ఈ సందర్భంగా వెల్లంకి వాస్తవ్యులు లక్ష్మీ మురళీధర్ కళాశాలకు యాభైవేల రూపాయల విలువైన కుర్చీలను విరాళంగా అందించారు.
ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్న అధ్యాపకుడు కె. పరమేష్ను కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రసూనాదేవి, పున్నారావు, మాలె వెంకట్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్, నగేష్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జానయ్య, జి. వెంకటేశ్వరరావు, శ్రవణ్, పరశురాములు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, నరసయ్య, యాదయ్య, వెంకటయ్య తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి