18 గంటలపాటు దర్శనానికి వేచి ఉన్న లక్షలాది అయ్యప్ప భక్తులు
శబరిమల స్థానిక ప్రతినిధి
పంబా నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో కిక్కిరిసింది. మకరజ్యోతి సీజన్ నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనానికి సుమారు 18 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
భక్తుల రద్దీ అదుపు తప్పడంతో చరిత్రలో తొలిసారిగా పంబా వద్ద గేట్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అన్ని మార్గాల్లో “స్వామియే శరణమయ్యప్ప” నినాదాలతో శబరిమల క్షేత్రం మార్మోగింది. భక్తుల ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు భద్రతా బలగాలు, ఆలయ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి