పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!
పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!
స్థానికం బృందం
బస్టాండ్లో కనిపించకుండా పోయిన మహిళ… ప్రియుడితో పరారైందా?
పకోడీలు తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వచ్చేలోపే భార్య అదృశ్యమైన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్ తన భార్య రిమ్ జిమ్ను తల్లిగారింటి నుంచి తిరిగి ఇంటికి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో వారు మొరాదాబాద్ జిల్లాలోని బిలారి బస్టాండ్ వద్ద ఆగారు. అక్కడ రిమ్ జిమ్ పకోడీలు తినాలని భర్తను అడిగింది.
దాంతో ప్రీతమ్ పకోడీలు తెచ్చేందుకు వెళ్లగా, తిరిగి వచ్చేసరికి రిమ్ జిమ్ అక్కడ కనిపించలేదు. బస్టాండ్ పరిసరాల్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో ప్రీతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రిమ్ జిమ్ తన పుట్టింటి గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి పరారై ఉండవచ్చని ప్రీతమ్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్ పరిసరాల సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి