Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:46 PM

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!
March 13, 2026 05:54 PM 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బస్టాండ్‌లో కనిపించకుండా పోయిన మహిళ… ప్రియుడితో పరారైందా?

పకోడీలు తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వచ్చేలోపే భార్య అదృశ్యమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్ తన భార్య రిమ్ జిమ్‌ను తల్లిగారింటి నుంచి తిరిగి ఇంటికి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో వారు మొరాదాబాద్ జిల్లాలోని బిలారి బస్టాండ్ వద్ద ఆగారు. అక్కడ రిమ్ జిమ్ పకోడీలు తినాలని భర్తను అడిగింది.

దాంతో ప్రీతమ్ పకోడీలు తెచ్చేందుకు వెళ్లగా, తిరిగి వచ్చేసరికి రిమ్ జిమ్ అక్కడ కనిపించలేదు. బస్టాండ్ పరిసరాల్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో ప్రీతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రిమ్ జిమ్ తన పుట్టింటి గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి పరారై ఉండవచ్చని ప్రీతమ్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్ పరిసరాల సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News