Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:22 PM

ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. 33 ఏళ్ల పాటు జీతం

ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. 33 ఏళ్ల పాటు జీతం

ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. 33 ఏళ్ల పాటు జీతం
17-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆర్‌టీఐతో బయటపడిన మోసం.. నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష

నకిలీ పత్రాల సాయంతో ఒకేసారి రెండు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ 33 ఏళ్ల పాటు జీతభత్యాలు పొందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా ఈ మోసం బయటపడింది. విచారణ జరిపిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది.

ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం బారాబంకి జిల్లాకు చెందిన ప్రభాత్ సింగ్ 2009 ఫిబ్రవరి 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్రీఖ్ ప్రాంతానికి చెందిన జయప్రకాష్ సింగ్ నకిలీ పత్రాలతో రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించాడని ఆరోపించారు.

విచారణలో జయప్రకాష్ సింగ్ 1979 డిసెంబర్ 26న ప్రతాప్‌గఢ్ జిల్లాలో నాన్ మెడికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరినట్లు వెల్లడైంది. అనంతరం 1993 జూన్‌లో బారాబంకి జిల్లాలోని ప్రాథమిక విద్యా శాఖలో ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. ఈ రెండు పదవుల్లో ఒకేసారి కొనసాగుతూ దశాబ్దాల పాటు రెండు శాఖల నుంచి జీతభత్యాలు పొందినట్లు దర్యాప్తులో తేలింది.

దీనిపై పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం ప్రధాన న్యాయ మేజిస్ట్రేట్ సుధా సింగ్ నిందితుడిని దోషిగా తేల్చారు. జయప్రకాష్ సింగ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

Sthanikam

ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. 33 ఏళ్ల పాటు జీతం

Article Image

ఆర్‌టీఐతో బయటపడిన మోసం.. నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష

నకిలీ పత్రాల సాయంతో ఒకేసారి రెండు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ 33 ఏళ్ల పాటు జీతభత్యాలు పొందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా ఈ మోసం బయటపడింది. విచారణ జరిపిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది.

ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం బారాబంకి జిల్లాకు చెందిన ప్రభాత్ సింగ్ 2009 ఫిబ్రవరి 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్రీఖ్ ప్రాంతానికి చెందిన జయప్రకాష్ సింగ్ నకిలీ పత్రాలతో రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించాడని ఆరోపించారు.

విచారణలో జయప్రకాష్ సింగ్ 1979 డిసెంబర్ 26న ప్రతాప్‌గఢ్ జిల్లాలో నాన్ మెడికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరినట్లు వెల్లడైంది. అనంతరం 1993 జూన్‌లో బారాబంకి జిల్లాలోని ప్రాథమిక విద్యా శాఖలో ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. ఈ రెండు పదవుల్లో ఒకేసారి కొనసాగుతూ దశాబ్దాల పాటు రెండు శాఖల నుంచి జీతభత్యాలు పొందినట్లు దర్యాప్తులో తేలింది.

దీనిపై పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం ప్రధాన న్యాయ మేజిస్ట్రేట్ సుధా సింగ్ నిందితుడిని దోషిగా తేల్చారు. జయప్రకాష్ సింగ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News