ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. 33 ఏళ్ల పాటు జీతం
ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. 33 ఏళ్ల పాటు జీతం
స్థానికం బృందం
ఆర్టీఐతో బయటపడిన మోసం.. నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష
నకిలీ పత్రాల సాయంతో ఒకేసారి రెండు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ 33 ఏళ్ల పాటు జీతభత్యాలు పొందిన ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఈ మోసం బయటపడింది. విచారణ జరిపిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం బారాబంకి జిల్లాకు చెందిన ప్రభాత్ సింగ్ 2009 ఫిబ్రవరి 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్రీఖ్ ప్రాంతానికి చెందిన జయప్రకాష్ సింగ్ నకిలీ పత్రాలతో రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించాడని ఆరోపించారు.
విచారణలో జయప్రకాష్ సింగ్ 1979 డిసెంబర్ 26న ప్రతాప్గఢ్ జిల్లాలో నాన్ మెడికల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరినట్లు వెల్లడైంది. అనంతరం 1993 జూన్లో బారాబంకి జిల్లాలోని ప్రాథమిక విద్యా శాఖలో ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. ఈ రెండు పదవుల్లో ఒకేసారి కొనసాగుతూ దశాబ్దాల పాటు రెండు శాఖల నుంచి జీతభత్యాలు పొందినట్లు దర్యాప్తులో తేలింది.
దీనిపై పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం ప్రధాన న్యాయ మేజిస్ట్రేట్ సుధా సింగ్ నిందితుడిని దోషిగా తేల్చారు. జయప్రకాష్ సింగ్కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి