Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:05 PM

ఒకరోజు ముందే పింఛన్ పండుగ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల ఆనందం

ఒకరోజు ముందే పింఛన్ పండుగ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల ఆనందం

ఒకరోజు ముందే పింఛన్ పండుగ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల ఆనందం
January 31, 2026 06:44 PM 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఆదోని:

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే నిర్వహించడంతో ఆదోనిలో పింఛన్ లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదోని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో బాబుజిపేట, హనుమాన్ నగర్, పెద్ద శక్తి గుడి పరిసర ప్రాంతాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సమయానికి పింఛన్ అందడం తమకు భరోసా కలిగించిందని లబ్ధిదారులు పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని టిడిపి నాయకులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేయడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సాయం అందిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News