PRINT TIME: February 23, 2026 05:17 PM
నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య
February 21, 2026 07:13 PM
377 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
చౌటుప్పల్,
రామన్నపేట మండలం నీర్నంల గ్రామానికి చెందిన నోముల సత్యనారాయణ స్వరూప కుమార్తె వివాహ వేడుకలు చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెస్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ వేడుకకు బంధుమిత్రులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పరస్పర అవగాహనతో కుటుంబ జీవితం ఆనందంగా కొనసాగించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి