నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ
నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ
Editor Desk
రామన్నపేట, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శ్రీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, పోచంపల్లిలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు మండలానికి చెందిన పలువురు సర్పంచులు హాజరయ్యారు. రామన్నపేట మండలంలోని సర్పంచులు బోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, ఇంద్రపాల నగరం సర్పంచ్ గర్దాసు విక్రమ్, నిర్నె ముల సర్పంచ్ కంది మల్ల గోపాల్ రెడ్డి , కొమ్మ యిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, వెల్లంకి సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్, శోభనాద్రిపురం సర్పంచ్ కంచి మధుసూదన్, సూరారం సర్పంచ్ బమిటిక శ్రీనివాస్, ఎన్నారం సర్పంచ్ వెలగపూడి జనని, మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, సర్నేనుగూడెం గంగాదేవి స్వామి, ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ రాజ్ చట్టం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ శిక్షణలు దోహదపడతాయని వారు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి