Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:30 AM

నూతన దంపతులకు నాయకుల ఆశీర్వాదం

నూతన దంపతులకు నాయకుల ఆశీర్వాదం

నూతన దంపతులకు నాయకుల ఆశీర్వాదం
February 22, 2026 08:07 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామంలో జరిగిన వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన మిరియాల పరశురాములు, విజయలలితల కుమార్తె వివాహానికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందడి మధ్య సాంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరస్పర అవగాహనతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వివాహం అనేది రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని, కొత్త జీవితాన్ని విలువలతో ముందుకు నడిపించాలని సూచించారు.

కార్యక్రమంలో టిఆర్ఎస్ రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్, నాతి నరేష్, బాసాని పరుశురాం, బెల్లి వినయ్, తిరుమలేష్, కృష్ణ, అచ్చాలు తదితరులు పాల్గొని దంపతులను ఆశీర్వదించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News