Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:04 PM

నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ లు చేయిస్తున్న డాక్యుమెంట్ రైటర్ లు

నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ లు చేయిస్తున్న డాక్యుమెంట్ రైటర్ లు

నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ లు చేయిస్తున్న డాక్యుమెంట్ రైటర్ లు
February 09, 2026 03:11 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా, నూజివీడు సబ్ రిజిస్ట్రార్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆగిపోయిన తనఖా రద్దు దొంగ రిజిస్ట్రేషన్.నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు.గతంలో శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో కోటి రూపాయల లోన్ తీసుకున్న తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన అద్దేపల్లి వెంకటరత్నం.శ్రీరామ్ ఫైనాన్స్ కు సంబంధం లేని దొడ్డి నాగరాజు అనే వ్యక్తి లోను క్లియర్ అయిందని నూజివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ ను రద్దు చేయడానికి వచ్చిన వైనం.కోటి రూపాయల లోన్ ఫైనాన్స్ సంస్థకు చెల్లించకుండానే, లోను తీరిపోయినట్లు ఆస్తి తనఖా రద్దు రిజిస్ట్రేషన్ చేసేందుకు దొంగ పత్రాలు అందించిన అద్దేపల్లి వెంకటరత్నం దొడ్డి నాగరాజు పెద్ద మొత్తంలో లోను రద్దు చేయడానికి తాడేపల్లిగూడెంలో ప్రయత్నం చేయకుండా, నూజివీడు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడంపై అనుమానం వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ యన్ ఫణి సీతారామరాజు నకిలీ పత్రాలు, నకిలీ ఆఫీస్ ఐడి కార్డు, నకిలీ స్టాంపులతో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించిన దొడ్డి నాగరాజు, అద్దేపల్లి వెంకటరత్నం లను కార్యాలయంలో బంధించి పట్టణ పోలీసులకు అప్పగించిన సబ్ రిజిస్ట్రార్ యన్ ఫణి సీతారామరాజు దొంగ తనఖా రిలీజ్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్, కొందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది మధ్యలో భారీ మొత్తంలో చేతులు మారినట్లు సమాచారం .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News