తెలంగాణ స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామంలో భోగి పండుగ సందర్భంగా భక్తిశ్రద్ధలతో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు మరియు మల్లన్న పట్నాలు నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.జనవరి 14, 2026 (బుధవారం) ఉదయం 10 గంటలకు నిదానపల్లి గ్రామ శివారులోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుట్టపై ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు.బోనాలు, పట్నాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వామివారి ప్రసాదాన్ని భక్తులు అందరూ స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ మల్లికార్జున ట్రస్ట్ పిలుపునిచ్చింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి