Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:33 PM

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం
February 17, 2026 07:26 AM 211 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రావణ నక్షత్రంలో శివపార్వతుల దివ్య కల్యాణం

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు సోమవారం (16-02-2026) భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఉదయం గణపతిపూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నిత్యార్చన, అభిషేకం, బిల్వార్చన, మంత్రపుష్పం వరకు శాస్త్రోక్తంగా సాగాయి. సాయంత్రం స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు.

రాత్రి 11 గంటలకు శ్రావణ నక్షత్ర యుక్త వృషభ లగ్న శుభముహూర్తంలో సిద్ధాంతి బెతోజి సత్యనారాయణ శాస్త్రి అర్చక బృందం ఆధ్వర్యంలో పాదార్చనాభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం (తలంబ్రాలు) వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

మంగళవాయిద్యాల నాదం, హారతుల వెలుగులు, భక్తుల హర్షధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. వేలాది మంది భక్తులు స్వామివారి దివ్య కల్యాణాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News