Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:56 PM

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం
February 17, 2026 07:26 AM 196 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

శ్రావణ నక్షత్రంలో శివపార్వతుల దివ్య కల్యాణం

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు సోమవారం (16-02-2026) భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఉదయం గణపతిపూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నిత్యార్చన, అభిషేకం, బిల్వార్చన, మంత్రపుష్పం వరకు శాస్త్రోక్తంగా సాగాయి. సాయంత్రం స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు.

రాత్రి 11 గంటలకు శ్రావణ నక్షత్ర యుక్త వృషభ లగ్న శుభముహూర్తంలో సిద్ధాంతి బెతోజి సత్యనారాయణ శాస్త్రి అర్చక బృందం ఆధ్వర్యంలో పాదార్చనాభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం (తలంబ్రాలు) వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

మంగళవాయిద్యాల నాదం, హారతుల వెలుగులు, భక్తుల హర్షధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. వేలాది మంది భక్తులు స్వామివారి దివ్య కల్యాణాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News