Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రీడాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత:అడిషనల్ కలెక్టర్ పాండు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:20 PM

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం
17-02-2026 217 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రావణ నక్షత్రంలో శివపార్వతుల దివ్య కల్యాణం

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు సోమవారం (16-02-2026) భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఉదయం గణపతిపూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నిత్యార్చన, అభిషేకం, బిల్వార్చన, మంత్రపుష్పం వరకు శాస్త్రోక్తంగా సాగాయి. సాయంత్రం స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు.

రాత్రి 11 గంటలకు శ్రావణ నక్షత్ర యుక్త వృషభ లగ్న శుభముహూర్తంలో సిద్ధాంతి బెతోజి సత్యనారాయణ శాస్త్రి అర్చక బృందం ఆధ్వర్యంలో పాదార్చనాభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం (తలంబ్రాలు) వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

మంగళవాయిద్యాల నాదం, హారతుల వెలుగులు, భక్తుల హర్షధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. వేలాది మంది భక్తులు స్వామివారి దివ్య కల్యాణాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

Sthanikam

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

Article Image

శ్రావణ నక్షత్రంలో శివపార్వతుల దివ్య కల్యాణం

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు సోమవారం (16-02-2026) భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఉదయం గణపతిపూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నిత్యార్చన, అభిషేకం, బిల్వార్చన, మంత్రపుష్పం వరకు శాస్త్రోక్తంగా సాగాయి. సాయంత్రం స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు.

రాత్రి 11 గంటలకు శ్రావణ నక్షత్ర యుక్త వృషభ లగ్న శుభముహూర్తంలో సిద్ధాంతి బెతోజి సత్యనారాయణ శాస్త్రి అర్చక బృందం ఆధ్వర్యంలో పాదార్చనాభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం (తలంబ్రాలు) వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

మంగళవాయిద్యాల నాదం, హారతుల వెలుగులు, భక్తుల హర్షధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. వేలాది మంది భక్తులు స్వామివారి దివ్య కల్యాణాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News