Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:40 AM

నిదానపల్లి లో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమం

నిదానపల్లి లో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమం

నిదానపల్లి లో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమం
February 05, 2026 11:32 AM 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వివక్షతకు ముగింపు – గౌరవానికి రక్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామపంచాయతీ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో కుష్ఠు వ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, బాధితులకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమంను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13, 2026 వరకు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా కుష్ఠు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, ఉచిత చికిత్సలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని, ఆలస్యం జరిగితే అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.కుష్ఠు వ్యాధి పూర్తిగా నయమయ్యే వ్యాధే. వివక్షతను విడిచిపెట్టి, బాధితులను గౌరవంగా చూడాలి” అని ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, వార్డు మెంబర్లు, వర్కాల వినయ్, కడారి ఐలయ్య, బొడిగె పూజ, నాయకులు దయ్యాల బిక్షమయ్య, కొండ మల్లేశం గౌడ్, కొండ శేఖర్, నారపాక అశోక్, తోటకూరి ఐలయ్య, భాష మల్ల సంతోష్,బొడ్డు పల్లి తిరుపతి, కడారి మల్లేశం, చల్ల మల్లేశం, సంకు స్వామి, బొడ్డుపల్లి సతీష్, భాష మల్ల బాల రాజు, కడారి అంగడయ్య వైద్య సిబ్బంది ఎంఎల్‌హెచ్‌పీ బేబీశాలిని,ఎంపిహెచ్‌ఏ డి. విజయలక్ష్మి,ఆశా కార్యకర్త జి. మాధవి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News