Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:53 AM

నిదానపల్లి లో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమం

నిదానపల్లి లో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమం

నిదానపల్లి లో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమం
February 05, 2026 11:32 AM 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

వివక్షతకు ముగింపు – గౌరవానికి రక్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామపంచాయతీ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో కుష్ఠు వ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, బాధితులకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమంను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13, 2026 వరకు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా కుష్ఠు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, ఉచిత చికిత్సలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని, ఆలస్యం జరిగితే అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.కుష్ఠు వ్యాధి పూర్తిగా నయమయ్యే వ్యాధే. వివక్షతను విడిచిపెట్టి, బాధితులను గౌరవంగా చూడాలి” అని ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, వార్డు మెంబర్లు, వర్కాల వినయ్, కడారి ఐలయ్య, బొడిగె పూజ, నాయకులు దయ్యాల బిక్షమయ్య, కొండ మల్లేశం గౌడ్, కొండ శేఖర్, నారపాక అశోక్, తోటకూరి ఐలయ్య, భాష మల్ల సంతోష్,బొడ్డు పల్లి తిరుపతి, కడారి మల్లేశం, చల్ల మల్లేశం, సంకు స్వామి, బొడ్డుపల్లి సతీష్, భాష మల్ల బాల రాజు, కడారి అంగడయ్య వైద్య సిబ్బంది ఎంఎల్‌హెచ్‌పీ బేబీశాలిని,ఎంపిహెచ్‌ఏ డి. విజయలక్ష్మి,ఆశా కార్యకర్త జి. మాధవి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News