Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:28 AM

నిబంధనలు ఉల్లంఘనపై మూడు స్కూల్ బస్సులు సీజ్

నిబంధనలు ఉల్లంఘనపై మూడు స్కూల్ బస్సులు సీజ్

నిబంధనలు ఉల్లంఘనపై మూడు స్కూల్ బస్సులు సీజ్
February 18, 2026 04:23 PM 242 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వివేకానంద, కృష్ణవేణి పాఠశాల వాహనాలపై ఆర్టీవో దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన మూడు స్కూల్ బస్సులను సీజ్ చేశారు.

రామన్నపేటలోని వివేకానంద స్కూల్ కు చెందిన రెండు బస్సులు, అలాగే కృష్ణవేణి స్కూల్ కు చెందిన ఒక బస్సును బుధవారం తనిఖీల సందర్భంగా నిలిపివేసినట్లు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి శ్రీ హర్ష వర్ధన్ రెడ్డి తెలిపారు.

తనిఖీల్లో గుర్తించిన లోపాలు ఇవీ:

డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం

బస్సులో విద్యార్థుల జాబితా లేకపోవడం

ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోవడం

ప్రతి బస్సులో తప్పనిసరిగా ఉండాల్సిన అటెండర్ లేకపోవడం

రూట్‌వారీగా విద్యార్థుల జాబితా నిర్వహించకపోవడం

పలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో సంబంధిత వాహనాలను సీజ్ చేసి రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News