నిబంధనలు ఉల్లంఘనపై మూడు స్కూల్ బస్సులు సీజ్
నిబంధనలు ఉల్లంఘనపై మూడు స్కూల్ బస్సులు సీజ్
స్థానికం బృందం
వివేకానంద, కృష్ణవేణి పాఠశాల వాహనాలపై ఆర్టీవో దాడులు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన మూడు స్కూల్ బస్సులను సీజ్ చేశారు.
రామన్నపేటలోని వివేకానంద స్కూల్ కు చెందిన రెండు బస్సులు, అలాగే కృష్ణవేణి స్కూల్ కు చెందిన ఒక బస్సును బుధవారం తనిఖీల సందర్భంగా నిలిపివేసినట్లు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి శ్రీ హర్ష వర్ధన్ రెడ్డి తెలిపారు.
తనిఖీల్లో గుర్తించిన లోపాలు ఇవీ:
డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం
బస్సులో విద్యార్థుల జాబితా లేకపోవడం
ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోవడం
ప్రతి బస్సులో తప్పనిసరిగా ఉండాల్సిన అటెండర్ లేకపోవడం
రూట్వారీగా విద్యార్థుల జాబితా నిర్వహించకపోవడం
పలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో సంబంధిత వాహనాలను సీజ్ చేసి రామన్నపేట పోలీస్ స్టేషన్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి