Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:17 PM

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
February 06, 2026 06:29 AM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తి శ్రద్ధలతో స్వామివారి చక్రతీర్థం

నేటితో ముగియనున్న శ్రీ శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

నార్కెట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ హరిహర క్షేత్రం గోపులాపల్లి శ్రీ శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా, భక్తుల అపూర్వ భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం హోమములు, బలిహరణం ఘనంగా నిర్వహించగా, మధ్యాహ్నం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారి కోనేరులో వేదమంత్రోచ్చారణల మధ్య చక్రతీర్థం అత్యంత భక్తిభావంతో నిర్వహించారు.సాయంకాలం స్వామి–అమ్మవార్ల సన్నిధిలో దోపోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి–అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.గతంతో పోలిస్తే గుట్టపై వసతులు మెరుగుపడటంతో వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా ఈసారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల హాజరు మరింతగా పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.

జనవరి 29న ప్రారంభమైన శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా శతకలశాభిషేకం, ధ్వజపట ఉద్వాసన, దేవత ఉద్వాసన, పుష్పయాగం, ఏకాంత సేవలు, పవళింపు సేవలతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు ప్రతాపురం మత్స్యగిరి స్వామి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమాల్లో అర్చక బృందం, ఆలయ సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News