PRINT TIME: April 10, 2026 01:24 PM
నేత నేతి విద్యాసాగర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్
నేత నేతి విద్యాసాగర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్
February 06, 2026 06:58 PM
169 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్:
మాజీ మండలి చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకుడు నేతి విద్యాసాగర్ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని తాజా రాజకీయ పరిణామాలు, గ్రామాభివృద్ధి అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.
స్థానిక సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతి విద్యాసాగర్ సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల బలోపేతం, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.సర్పంచ్ గర్దాస్ విక్రమ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకానికి అనుగుణంగా పాలన అందించడమే లక్ష్యమని, అనుభవజ్ఞుల సలహాలు తమకు దిశానిర్దేశకమని పేర్కొన్నారు. ఈ భేటీ స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి