Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రీడాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత:అడిషనల్ కలెక్టర్ పాండు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:22 PM

నీర్నంల కమాన్ వద్ద శాస్త్రబద్ధంగా లింగ ప్రతిష్ఠాపన

నీర్నంల కమాన్ వద్ద శాస్త్రబద్ధంగా లింగ ప్రతిష్ఠాపన

నీర్నంల కమాన్ వద్ద శాస్త్రబద్ధంగా లింగ ప్రతిష్ఠాపన
17-02-2026 410 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక శోభ

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాల సందర్భంగా నీర్నంల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాల ఆర్చ్ తోరణం వద్ద కమాన్ సమీపంలో శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.

బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్త విధానంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక పూజల మధ్య లింగ ప్రతిష్ఠాపన నిర్వహించారు. వేదమంత్రాల నాదం మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామం అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

ఈ కార్యక్రమంలో నిర్నముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్, నిదానపల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ, నాయకులు నారపాక యాదయ్య, కొండ మల్లేశం గౌడ్, ఆగు లింగస్వామి, బొడ్డుపల్లి సతీష్, మాజీ సర్పంచ్ ఆవుల నరసింహ యాదవ్, ఆవుల క్రాంతి కుమార్ యాదవ్, కట్ట కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీర్నంల కమాన్ వద్ద శాస్త్రబద్ధంగా లింగ ప్రతిష్ఠాపన

Article Image

బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక శోభ

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాల సందర్భంగా నీర్నంల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాల ఆర్చ్ తోరణం వద్ద కమాన్ సమీపంలో శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.

బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్త విధానంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక పూజల మధ్య లింగ ప్రతిష్ఠాపన నిర్వహించారు. వేదమంత్రాల నాదం మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామం అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

ఈ కార్యక్రమంలో నిర్నముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్, నిదానపల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ, నాయకులు నారపాక యాదయ్య, కొండ మల్లేశం గౌడ్, ఆగు లింగస్వామి, బొడ్డుపల్లి సతీష్, మాజీ సర్పంచ్ ఆవుల నరసింహ యాదవ్, ఆవుల క్రాంతి కుమార్ యాదవ్, కట్ట కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News