Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:46 AM

నీర్నంల కమాన్ వద్ద శాస్త్రబద్ధంగా లింగ ప్రతిష్ఠాపన

నీర్నంల కమాన్ వద్ద శాస్త్రబద్ధంగా లింగ ప్రతిష్ఠాపన

నీర్నంల కమాన్ వద్ద శాస్త్రబద్ధంగా లింగ ప్రతిష్ఠాపన
February 17, 2026 07:10 AM 396 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక శోభ

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాల సందర్భంగా నీర్నంల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాల ఆర్చ్ తోరణం వద్ద కమాన్ సమీపంలో శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.

బేతోజు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్త విధానంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక పూజల మధ్య లింగ ప్రతిష్ఠాపన నిర్వహించారు. వేదమంత్రాల నాదం మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామం అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

ఈ కార్యక్రమంలో నిర్నముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్, నిదానపల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ, నాయకులు నారపాక యాదయ్య, కొండ మల్లేశం గౌడ్, ఆగు లింగస్వామి, బొడ్డుపల్లి సతీష్, మాజీ సర్పంచ్ ఆవుల నరసింహ యాదవ్, ఆవుల క్రాంతి కుమార్ యాదవ్, కట్ట కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News