అమరావతి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సాయిప్రసాద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:33 నిమిషాలకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుత సీఎస్గా కొనసాగుతున్న విజయానంద్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సేవలకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
పాలనలో అనుభవజ్ఞుడైన సాయిప్రసాద్ రాష్ట్ర పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణతో అధికార యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి