Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

న్యాల్కల్‌లో భాజపా శ్రేణుల ముందస్తు అరెస్ట్

న్యాల్కల్‌లో భాజపా శ్రేణుల ముందస్తు అరెస్ట్

న్యాల్కల్‌లో భాజపా శ్రేణుల ముందస్తు అరెస్ట్
24-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్లనున్న భాజపా శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవుతారనే సమాచారంతో తెల్లవారు జామునే పోలీసులు చర్యలు చేపట్టారు.స్థానిక హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాజపా నాయకుల ఇళ్లకు చేరుకున్న పోలీసులు, మండలంలోని ప్రముఖ నాయకులు మరియు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు గంగ్వార్ మల్లేష్‌తో పాటు న్యాల్కల్, ముంగి, వడ్డీ, రత్నాపూర్, హద్నూర్, గుంజేట్టి తదితర గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గంగ్వార్ మల్లేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భాజపా శ్రేణులు ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేపడతాయని ఆయన పేర్కొన్నారు.అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ అరెస్టులు చేపట్టినట్లు సమాచారం.

Sthanikam

న్యాల్కల్‌లో భాజపా శ్రేణుల ముందస్తు అరెస్ట్

Article Image

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్లనున్న భాజపా శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవుతారనే సమాచారంతో తెల్లవారు జామునే పోలీసులు చర్యలు చేపట్టారు.స్థానిక హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాజపా నాయకుల ఇళ్లకు చేరుకున్న పోలీసులు, మండలంలోని ప్రముఖ నాయకులు మరియు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు గంగ్వార్ మల్లేష్‌తో పాటు న్యాల్కల్, ముంగి, వడ్డీ, రత్నాపూర్, హద్నూర్, గుంజేట్టి తదితర గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గంగ్వార్ మల్లేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భాజపా శ్రేణులు ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేపడతాయని ఆయన పేర్కొన్నారు.అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ అరెస్టులు చేపట్టినట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News