నారాయణఖేడ్ 5వ వార్డులో మొరం రోడ్డు మరమ్మత్తులు
నారాయణఖేడ్ 5వ వార్డులో మొరం రోడ్డు మరమ్మత్తులు
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు.ఎమ్మెల్యే సంజీవ రెడ్డి,ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సూచనల మేరకు ఈ రోజు మొరం వేసి తాత్కాలిక రోడ్డు మరమ్మత్తులు నిర్వహించారు.మున్సిపాలిటీ పరిధిలోని మైతప్ పటేల్ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గుంతలుగా మారాయి.ఈ సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అధికారులను ఆదేశించి మొరం వేసి రోడ్డు మరమ్మత్తులు చేయించారు.ఈ సందర్భంగా ప్రజలు, వాహనచోదకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అవసరమైతే మరోసారి మొరం వేసే అవకాశం ఉందని నారాయణఖేడ్ మున్సిపాలిటీ 5వ వార్డు సభ్యుడు బాణపురం రాజు తెలిపారు.అలాగే కాలనీలో అతి త్వరలోనే శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ఈ చర్యలతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి