Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:22 AM

నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా, బాధ్యతా యుతంగా జరుపుకుందాం చాట్రాయి ఎస్ ఐ డి రామకృష్ణ వెల్లడి

నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా, బాధ్యతా యుతంగా జరుపుకుందాం చాట్రాయి ఎస్ ఐ డి రామకృష్ణ వెల్లడి

నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా, బాధ్యతా యుతంగా జరుపుకుందాం  చాట్రాయి ఎస్ ఐ డి రామకృష్ణ వెల్లడి
December 31, 2025 12:45 PM 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా బాధ్యతాయుతంగా జరుపుకుందాం

ఏలూరు స్థానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి
గతించిన 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, ఆశావహ దృక్పథంతో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న జిల్లా ప్రజలందరికీ ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేసినారు.గత ఏడాది కంటే మెరుగైన, స్నేహపూర్వకమైన మరియు పారదర్శకమైన సేవలను నూతన సంవత్సరంలో పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.డిసెంబర్ 31 రాత్రి వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసులు కింది మార్గదర్శకాలను జారీ చేశారు. దేవాలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలలో యువత మహిళల పట్ల వేధింపులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని,

నిర్వాహకులకు సూచనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.వేడుకల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగినంత పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలి. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా నిబంధనలు పాటించాలి.

యువతకు మరియు తల్లిదండ్రులకు హెచ్చరిక*

మైనర్ డ్రైవింగ్ తల్లి దండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. ఒకవేళ మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, సదరు పిల్లలతో పాటు తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. మోటార్ సైకిల్ పై ముగ్గురు ఎక్కి ప్రయాణించడం, అతివేగంగా నడపడం, మోటార్ సైకిల్ సైరన్ తీసి వేసి వింత శబ్దాలు చేసే హారన్లు మోగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన నిఘా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఏమాత్రం ఉపేక్షించబోము.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి రూ. 10,000/- జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వాహనదారులు తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని ఎస్పీ గారు కోరారు డ్రోన్లు మరియు సీసీ కెమెరాల నిఘా వేడుకల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.

నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.వేడుకలు అనేవి ఆనందాన్ని పంచాలి తప్ప విషాదాన్ని నింపకూడదు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ విధించిన షరతులకు అనుగుణంగా వ్యవహరిస్తూ, క్రమశిక్షణతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలి. మీరక్షణే మా ప్రాధాన్యత.శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవడానికి మండల ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News