నూతన అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల జేఏసీ డిమాండ్
నూతన అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల జేఏసీ డిమాండ్
స్థానికం బృందం
అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన అక్రిడేషన్ జారీ ప్రక్రియ జీవోను తక్షణమే సవరించాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల జేఏసీ శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కీలక సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడిన టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమన్న, టీజేఎస్ఎస్ అధ్యక్షుడు ఆనించిన్ని వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి నూతన అక్రిడేషన్ జీవోలోని పలు నిబంధనలు జర్నలిస్టులకు అన్యాయం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రిడేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులు, ఉపాధి భద్రతకు భంగం కలగకుండా అన్ని సంఘాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో ఆయా యూనియన్లకు చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి