Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:34 AM

నూతన అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల జేఏసీ డిమాండ్

నూతన అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల జేఏసీ డిమాండ్

నూతన అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల జేఏసీ డిమాండ్
27-12-2025 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల డిమాండ్


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన అక్రిడేషన్ జారీ ప్రక్రియ జీవోను తక్షణమే సవరించాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల జేఏసీ శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కీలక సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడిన టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమన్న, టీజేఎస్ఎస్ అధ్యక్షుడు ఆనించిన్ని వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి నూతన అక్రిడేషన్ జీవోలోని పలు నిబంధనలు జర్నలిస్టులకు అన్యాయం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అక్రిడేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులు, ఉపాధి భద్రతకు భంగం కలగకుండా అన్ని సంఘాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో ఆయా యూనియన్లకు చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల జేఏసీ డిమాండ్

Article Image

అక్రిడేషన్ జీవో సవరణకు జర్నలిస్టు సంఘాల డిమాండ్


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన అక్రిడేషన్ జారీ ప్రక్రియ జీవోను తక్షణమే సవరించాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల జేఏసీ శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కీలక సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడిన టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమన్న, టీజేఎస్ఎస్ అధ్యక్షుడు ఆనించిన్ని వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి నూతన అక్రిడేషన్ జీవోలోని పలు నిబంధనలు జర్నలిస్టులకు అన్యాయం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అక్రిడేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులు, ఉపాధి భద్రతకు భంగం కలగకుండా అన్ని సంఘాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో ఆయా యూనియన్లకు చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News