నామినేషన్ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలి – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు
నామినేషన్ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలి – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు
స్థానికం బృందం
చౌటుప్పల్:స్థానికం ప్రధాన ప్రతినిధి
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు.
గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డు స్థానాలకు ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ నిబంధనల ప్రకారం జరుగుతోందా లేదా అన్న అంశాన్ని సవివరంగా పరిశీలించారు.
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో ఏర్పాటు చేసిన సదుపాయాలు, సహాయ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు, సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్లు సమర్పించే సమయంలో చిన్నపాటి పొరపాట్లకూ అవకాశం లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.అలాగే నామినేషన్ పత్రాలకు జతచేయాల్సిన ధ్రువపత్రాలు పూర్తిగా ఉన్నాయా లేదా అని నిర్ధారించాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని, నిబంధనల అమలులో కట్టుదిట్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంబంధిత నివేదికలను నిర్దేశిత అనువర్తనంలో సమయానికి నమోదు చేయాలన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి