Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

నిమ్స్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం

నిమ్స్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం

నిమ్స్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం
December 29, 2025 07:35 PM 602 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

నిమ్స్ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం.

ఆర్జిత సెలవుల నగదు మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సర్కార్ జీవో.

మాట నిలబెట్టుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ.

అందోల్, స్థానికం ప్రతినిధి:

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఉద్యోగుల ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. వారు కోరుతున్నట్టుగా ‘ఆర్జిత సెలవుల నగదు మార్పిడి (earned leaves encashment)’కి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో, నిమ్స్ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నం. 230) జారీ చేసింది.

ఎయిమ్స్ పే స్కేల్స్ పొందుతున్న నిమ్స్ రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నాయి. ఇటీవల హాస్పిటల్ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి తమ సమస్యను విన్నవించారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న 'తెలంగాణ లీవ్ రూల్స్-1933' నిబంధనల ప్రకారమే, ఇకపై నిమ్స్ ఉద్యోగులు కూడా తమ ఆర్జిత సెలవులను సరెండర్ చేసి నగదు పొందవచ్చు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు సోమవారం జీవో విడుదల చేశారు.

ఉద్యోగుల హర్షం:

తమ కష్టాన్ని గుర్తించి, చిరకాల కాంక్షను నెరవేర్చినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి నిమ్స్ ఉద్యోగ వర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుందని వారు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News