Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:00 AM

నాలుగు రోజులు బ్యాంకులు మూత… ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం

నాలుగు రోజులు బ్యాంకులు మూత… ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం

నాలుగు రోజులు బ్యాంకులు మూత… ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం
24-01-2026 213 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు అందుబాటులో ఉండవు. జనవరి 24వ తేదీ నాలుగో శనివారం, 25వ తేదీ ఆదివారం, 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండగా, 27వ తేదీన బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి.


వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా నాలుగు రోజుల పాటు కౌంటర్ సేవలు నిలిచిపోనున్నాయి.అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎంలు, ఆన్‌లైన్ లావాదేవీలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. నగదు అవసరాలు ఉన్న వారు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో చెక్కుల క్లియరెన్స్, కౌంటర్ లావాదేవీలు, కొత్త ఖాతాల ప్రారంభం వంటి సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర బ్యాంకు పనులను ఖాతాదారులు ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకు వర్గాలు కోరుతున్నాయి.

Sthanikam

నాలుగు రోజులు బ్యాంకులు మూత… ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం

Article Image

స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు అందుబాటులో ఉండవు. జనవరి 24వ తేదీ నాలుగో శనివారం, 25వ తేదీ ఆదివారం, 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండగా, 27వ తేదీన బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి.


వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా నాలుగు రోజుల పాటు కౌంటర్ సేవలు నిలిచిపోనున్నాయి.అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎంలు, ఆన్‌లైన్ లావాదేవీలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. నగదు అవసరాలు ఉన్న వారు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో చెక్కుల క్లియరెన్స్, కౌంటర్ లావాదేవీలు, కొత్త ఖాతాల ప్రారంభం వంటి సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర బ్యాంకు పనులను ఖాతాదారులు ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకు వర్గాలు కోరుతున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News