నాలుగు రోజులు బ్యాంకులు మూత… ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం
నాలుగు రోజులు బ్యాంకులు మూత… ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు అందుబాటులో ఉండవు. జనవరి 24వ తేదీ నాలుగో శనివారం, 25వ తేదీ ఆదివారం, 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండగా, 27వ తేదీన బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి.
వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా నాలుగు రోజుల పాటు కౌంటర్ సేవలు నిలిచిపోనున్నాయి.అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎంలు, ఆన్లైన్ లావాదేవీలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. నగదు అవసరాలు ఉన్న వారు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో చెక్కుల క్లియరెన్స్, కౌంటర్ లావాదేవీలు, కొత్త ఖాతాల ప్రారంభం వంటి సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర బ్యాంకు పనులను ఖాతాదారులు ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకు వర్గాలు కోరుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి