Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:36 AM

నల్లగొండలో పిస్తా హౌస్ ప్రారంభం – సూపర్ స్మార్ట్ సిటీ లక్ష్యమే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండలో పిస్తా హౌస్ ప్రారంభం – సూపర్ స్మార్ట్ సిటీ లక్ష్యమే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండలో పిస్తా హౌస్ ప్రారంభం – సూపర్ స్మార్ట్ సిటీ లక్ష్యమే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
February 21, 2026 06:57 PM 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పిస్తా హౌస్ బ్రాంచ్ ప్రారంభం కావడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

శనివారం హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్‌ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండను వ్యాపార, వాణిజ్యపరంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా మాత్రమే కాకుండా గ్రీన్ సిటీగా కూడా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు దీటుగా అన్ని వసతులతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెత్త రహిత నగరంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు.

రెండు సంవత్సరాల్లోనే నల్లగొండను మోడల్ సిటీగా రూపుదిద్దించి, ఇతర పట్టణాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పిస్తా హౌస్ బ్రాంచ్‌ను నల్లగొండలో ఏర్పాటు చేసిన నిర్వాహకులను మంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్ ఇటికల మంగమ్మ శ్రీనివాస్, ఇతర కార్పొరేటర్లు, నిర్వాహకులు కొణతం నాగిరెడ్డి, వినయ్ రెడ్డి, మిథున్ రెడ్డి, నవ కిషోర్ రెడ్డి, కొణతం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News