నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన ఉత్సవ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన ఉత్సవ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ పరిధిలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ శివరాత్రి నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ కమిటీని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ చల్ల నరసింహతో పాటు డైరెక్టర్లు గురువారం చిట్యాలలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తుల విశ్వాసానికి తగ్గట్టుగా నిర్వహించాలనే సంకల్పాన్ని కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనలో ప్రజాప్రతినిధుల సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్యే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహను డైరెక్టర్లు సంకు స్వామి, కడారి మల్లేశం అంగడయ్య, భాషమల్ల బాలరాజు, ఆగు చిన్న లింగస్వామి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో నిదానపల్లి మాజీ సర్పంచ్ గుత్తా నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు పూస బాలకృష్ణ, మందడి ప్రభాకర్ రెడ్డి, గ్రామ పెద్దలు దయ్యాల బిక్షమయ్య, చల్ల శ్రీశైలం, నారపాక యాదయ్య, కొండమల్లయ్య, బొడిగే రంగయ్య, కొండ శేఖర్, తోటకూర ఐలయ్య, ఏకుల మల్లేశం, బొబ్బూరి నరసింహ, భాషమల్ల సంతోష్, కడారి మల్లేశం, నారపాక జడ్జి తదితరులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి