Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:42 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన ఉత్సవ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్లు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన ఉత్సవ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్లు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన ఉత్సవ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్లు
February 05, 2026 04:48 PM 419 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ పరిధిలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ శివరాత్రి నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ కమిటీని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ చల్ల నరసింహతో పాటు డైరెక్టర్లు గురువారం చిట్యాలలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తుల విశ్వాసానికి తగ్గట్టుగా నిర్వహించాలనే సంకల్పాన్ని కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనలో ప్రజాప్రతినిధుల సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్యే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ చైర్మన్‌ చల్ల నరసింహను డైరెక్టర్లు సంకు స్వామి, కడారి మల్లేశం అంగడయ్య, భాషమల్ల బాలరాజు, ఆగు చిన్న లింగస్వామి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో నిదానపల్లి మాజీ సర్పంచ్ గుత్తా నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు పూస బాలకృష్ణ, మందడి ప్రభాకర్ రెడ్డి, గ్రామ పెద్దలు దయ్యాల బిక్షమయ్య, చల్ల శ్రీశైలం, నారపాక యాదయ్య, కొండమల్లయ్య, బొడిగే రంగయ్య, కొండ శేఖర్, తోటకూర ఐలయ్య, ఏకుల మల్లేశం, బొబ్బూరి నరసింహ, భాషమల్ల సంతోష్, కడారి మల్లేశం, నారపాక జడ్జి తదితరులు హాజరయ్యారు.




మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News