Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 12:50 PM

నకిలీ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 15 రోజుల్లో విచారణ – 7 రోజుల్లో తుది ఉత్తర్వులు

నకిలీ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 15 రోజుల్లో విచారణ – 7 రోజుల్లో తుది ఉత్తర్వులు

నకిలీ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 15 రోజుల్లో విచారణ – 7 రోజుల్లో తుది ఉత్తర్వులు
02-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి, ఆంధ్రప్రదేశ్ లో నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

భూ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆస్తి హక్కులను రక్షించేందుకు జిల్లా కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 22A, 22B, 22C కేటగిరీ భూములపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు.

ఫిర్యాదు అందిన 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, తదుపరి 7 రోజుల్లో తుది ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భూ వ్యవహారాల్లో పారదర్శకత, వేగవంతమైన న్యాయం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Sthanikam

నకిలీ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 15 రోజుల్లో విచారణ – 7 రోజుల్లో తుది ఉత్తర్వులు

Article Image

అమరావతి, ఆంధ్రప్రదేశ్ లో నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

భూ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆస్తి హక్కులను రక్షించేందుకు జిల్లా కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 22A, 22B, 22C కేటగిరీ భూములపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు.

ఫిర్యాదు అందిన 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, తదుపరి 7 రోజుల్లో తుది ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భూ వ్యవహారాల్లో పారదర్శకత, వేగవంతమైన న్యాయం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News