PRINT TIME: March 02, 2026 04:48 PM
నకిలీ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 15 రోజుల్లో విచారణ – 7 రోజుల్లో తుది ఉత్తర్వులు
నకిలీ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 15 రోజుల్లో విచారణ – 7 రోజుల్లో తుది ఉత్తర్వులు
March 02, 2026 02:27 PM
19 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
అమరావతి, ఆంధ్రప్రదేశ్ లో నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
భూ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆస్తి హక్కులను రక్షించేందుకు జిల్లా కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 22A, 22B, 22C కేటగిరీ భూములపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఫిర్యాదు అందిన 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, తదుపరి 7 రోజుల్లో తుది ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భూ వ్యవహారాల్లో పారదర్శకత, వేగవంతమైన న్యాయం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి