Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:25 AM

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి
23-02-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రజక ఫౌండేషన్ ముంబై డిమాండ్

రజక ఫౌండేషన్ ముంబై నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 18న గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబం టికెట్ లేకుండా ఆలయంలోకి ప్రవేశించిందనే ఆరోపణలతో గ్రామ సర్పంచ్ సహా అగ్రకుల పెత్తందారులు దుర్భాషలాడుతూ, విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపించారు.

దాడి సమయంలో రెండు నెలల పసిపాపను కిరాతకంగా తన్నడంతో మృతి చెందిందని ఫౌండేషన్ నాయకులు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉండాల్సిన వారు అధికారం దుర్వినియోగం చేస్తూ అత్యంత వెనుకబడిన వర్గాలపై దాడులు చేయడం అమానుషమని ఖండించారు.

పసిపాప మృతికి కారణమైన వారిపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించి, తగిన నష్టపరిహారం ప్రకటించడంతో పాటు వైద్య ఖర్చులను నిందితులే భరించాలని కోరారు.

ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ మేరకు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహేంద్ర చింతలతాడేపు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

Sthanikam

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి

Article Image

రజక ఫౌండేషన్ ముంబై డిమాండ్

రజక ఫౌండేషన్ ముంబై నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 18న గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబం టికెట్ లేకుండా ఆలయంలోకి ప్రవేశించిందనే ఆరోపణలతో గ్రామ సర్పంచ్ సహా అగ్రకుల పెత్తందారులు దుర్భాషలాడుతూ, విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపించారు.

దాడి సమయంలో రెండు నెలల పసిపాపను కిరాతకంగా తన్నడంతో మృతి చెందిందని ఫౌండేషన్ నాయకులు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉండాల్సిన వారు అధికారం దుర్వినియోగం చేస్తూ అత్యంత వెనుకబడిన వర్గాలపై దాడులు చేయడం అమానుషమని ఖండించారు.

పసిపాప మృతికి కారణమైన వారిపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించి, తగిన నష్టపరిహారం ప్రకటించడంతో పాటు వైద్య ఖర్చులను నిందితులే భరించాలని కోరారు.

ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ మేరకు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహేంద్ర చింతలతాడేపు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News