Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:49 PM

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి
February 23, 2026 04:53 AM 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రజక ఫౌండేషన్ ముంబై డిమాండ్

రజక ఫౌండేషన్ ముంబై నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 18న గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబం టికెట్ లేకుండా ఆలయంలోకి ప్రవేశించిందనే ఆరోపణలతో గ్రామ సర్పంచ్ సహా అగ్రకుల పెత్తందారులు దుర్భాషలాడుతూ, విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపించారు.

దాడి సమయంలో రెండు నెలల పసిపాపను కిరాతకంగా తన్నడంతో మృతి చెందిందని ఫౌండేషన్ నాయకులు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉండాల్సిన వారు అధికారం దుర్వినియోగం చేస్తూ అత్యంత వెనుకబడిన వర్గాలపై దాడులు చేయడం అమానుషమని ఖండించారు.

పసిపాప మృతికి కారణమైన వారిపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించి, తగిన నష్టపరిహారం ప్రకటించడంతో పాటు వైద్య ఖర్చులను నిందితులే భరించాలని కోరారు.

ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ మేరకు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహేంద్ర చింతలతాడేపు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News