Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:14 AM

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి

నాగర్ కర్నూల్‌లో రజకులపై దాడి: పసిపాప మృతి – హత్య కేసు నమోదు చేయాలి
February 23, 2026 04:53 AM 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రజక ఫౌండేషన్ ముంబై డిమాండ్

రజక ఫౌండేషన్ ముంబై నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 18న గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబం టికెట్ లేకుండా ఆలయంలోకి ప్రవేశించిందనే ఆరోపణలతో గ్రామ సర్పంచ్ సహా అగ్రకుల పెత్తందారులు దుర్భాషలాడుతూ, విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపించారు.

దాడి సమయంలో రెండు నెలల పసిపాపను కిరాతకంగా తన్నడంతో మృతి చెందిందని ఫౌండేషన్ నాయకులు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉండాల్సిన వారు అధికారం దుర్వినియోగం చేస్తూ అత్యంత వెనుకబడిన వర్గాలపై దాడులు చేయడం అమానుషమని ఖండించారు.

పసిపాప మృతికి కారణమైన వారిపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించి, తగిన నష్టపరిహారం ప్రకటించడంతో పాటు వైద్య ఖర్చులను నిందితులే భరించాలని కోరారు.

ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ మేరకు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహేంద్ర చింతలతాడేపు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News