Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:39 PM

మునిపంపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షుల నియామకం

మునిపంపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షుల నియామకం

మునిపంపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షుల నియామకం
January 31, 2026 03:03 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల బిజెపి అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి శుక్రవారం మునిపంపుల గ్రామానికి సంబంధించిన మూడు బూత్‌లకు బూత్ అధ్యక్షులను నియమించారు.

గ్రామంలోని

46వ బూత్‌కు మామిళ్ళ నరేందర్,

47వ బూత్‌కు సద్దల వెంకన్న,

48వ బూత్‌కు రావుల నరేష్

బూత్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బూత్ అధ్యక్షులు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో మునిపంపుల గ్రామంలో బిజెపి జెండా ఎగరేయడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.

అలాగే, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో మునిపంపుల గ్రామం కూడా ఆదర్శంగా నిలవాలని, ముఖ్యంగా యువత చురుకుగా రాజకీయాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనం అంజయ్య, బిజెపి సీనియర్ నాయకులు డోగీపర్తి సుభాష్, కట్ట యాదయ్య, మన్నెం పద్మారెడ్డి, జిల్లా యువ మోర్చా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు, నీల రాజేష్, ఏలూరి శ్యామ్, మేకల మల్లారెడ్డి, సురువు జాంగిర్, మిరియాల శ్యాంసుందర్, మామిళ్ళ సుధీర్, చింత రమేష్, మిరియాల శ్రీధర్, పోగుల నవీన్, మామిళ్ళ జలంధర్, ఆకుల వీరేష్, బోగిని రమేష్, దామరి నాగేష్, కొమ్మిరి ప్రశాంత్, పీట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News