Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:37 AM

మునిపంపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షుల నియామకం

మునిపంపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షుల నియామకం

మునిపంపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షుల నియామకం
January 31, 2026 03:03 PM 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల బిజెపి అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి శుక్రవారం మునిపంపుల గ్రామానికి సంబంధించిన మూడు బూత్‌లకు బూత్ అధ్యక్షులను నియమించారు.

గ్రామంలోని

46వ బూత్‌కు మామిళ్ళ నరేందర్,

47వ బూత్‌కు సద్దల వెంకన్న,

48వ బూత్‌కు రావుల నరేష్

బూత్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బూత్ అధ్యక్షులు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో మునిపంపుల గ్రామంలో బిజెపి జెండా ఎగరేయడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.

అలాగే, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో మునిపంపుల గ్రామం కూడా ఆదర్శంగా నిలవాలని, ముఖ్యంగా యువత చురుకుగా రాజకీయాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనం అంజయ్య, బిజెపి సీనియర్ నాయకులు డోగీపర్తి సుభాష్, కట్ట యాదయ్య, మన్నెం పద్మారెడ్డి, జిల్లా యువ మోర్చా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు, నీల రాజేష్, ఏలూరి శ్యామ్, మేకల మల్లారెడ్డి, సురువు జాంగిర్, మిరియాల శ్యాంసుందర్, మామిళ్ళ సుధీర్, చింత రమేష్, మిరియాల శ్రీధర్, పోగుల నవీన్, మామిళ్ళ జలంధర్, ఆకుల వీరేష్, బోగిని రమేష్, దామరి నాగేష్, కొమ్మిరి ప్రశాంత్, పీట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News