మునిపంపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షుల నియామకం
మునిపంపుల గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షుల నియామకం
స్థానికం బృందం
రామన్నపేట మండల బిజెపి అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి శుక్రవారం మునిపంపుల గ్రామానికి సంబంధించిన మూడు బూత్లకు బూత్ అధ్యక్షులను నియమించారు.
గ్రామంలోని
46వ బూత్కు మామిళ్ళ నరేందర్,
47వ బూత్కు సద్దల వెంకన్న,
48వ బూత్కు రావుల నరేష్
బూత్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బూత్ అధ్యక్షులు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో మునిపంపుల గ్రామంలో బిజెపి జెండా ఎగరేయడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.
అలాగే, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో మునిపంపుల గ్రామం కూడా ఆదర్శంగా నిలవాలని, ముఖ్యంగా యువత చురుకుగా రాజకీయాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనం అంజయ్య, బిజెపి సీనియర్ నాయకులు డోగీపర్తి సుభాష్, కట్ట యాదయ్య, మన్నెం పద్మారెడ్డి, జిల్లా యువ మోర్చా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు, నీల రాజేష్, ఏలూరి శ్యామ్, మేకల మల్లారెడ్డి, సురువు జాంగిర్, మిరియాల శ్యాంసుందర్, మామిళ్ళ సుధీర్, చింత రమేష్, మిరియాల శ్రీధర్, పోగుల నవీన్, మామిళ్ళ జలంధర్, ఆకుల వీరేష్, బోగిని రమేష్, దామరి నాగేష్, కొమ్మిరి ప్రశాంత్, పీట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి