Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:20 PM

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి
February 04, 2026 02:24 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సాధారణ పరిశీలకులు గౌతమి సమక్షంలో జరిగింది.ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ సిబ్బంది కేటాయింపు చేపట్టారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగేలా అదనపు కలెక్టర్, సాధారణ పరిశీలకులు నిశితంగా పర్యవేక్షించారు.జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న వార్డు ఎన్నికల పోలింగ్ విధులకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.

జిల్లాలో మొత్తం 104 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నిర్వహణ సజావుగా సాగేందుకు 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, ఇతర పోలింగ్ అధికారులు 514 మందిని కేటాయించారు.ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News