Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:39 AM

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి
February 04, 2026 02:24 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సాధారణ పరిశీలకులు గౌతమి సమక్షంలో జరిగింది.ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ సిబ్బంది కేటాయింపు చేపట్టారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగేలా అదనపు కలెక్టర్, సాధారణ పరిశీలకులు నిశితంగా పర్యవేక్షించారు.జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న వార్డు ఎన్నికల పోలింగ్ విధులకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.

జిల్లాలో మొత్తం 104 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నిర్వహణ సజావుగా సాగేందుకు 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, ఇతర పోలింగ్ అధికారులు 514 మందిని కేటాయించారు.ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News