Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:52 AM

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి
February 04, 2026 02:24 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సాధారణ పరిశీలకులు గౌతమి సమక్షంలో జరిగింది.ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ సిబ్బంది కేటాయింపు చేపట్టారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగేలా అదనపు కలెక్టర్, సాధారణ పరిశీలకులు నిశితంగా పర్యవేక్షించారు.జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న వార్డు ఎన్నికల పోలింగ్ విధులకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.

జిల్లాలో మొత్తం 104 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నిర్వహణ సజావుగా సాగేందుకు 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, ఇతర పోలింగ్ అధికారులు 514 మందిని కేటాయించారు.ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News