Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:37 PM

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి
04-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సాధారణ పరిశీలకులు గౌతమి సమక్షంలో జరిగింది.ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ సిబ్బంది కేటాయింపు చేపట్టారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగేలా అదనపు కలెక్టర్, సాధారణ పరిశీలకులు నిశితంగా పర్యవేక్షించారు.జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న వార్డు ఎన్నికల పోలింగ్ విధులకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.

జిల్లాలో మొత్తం 104 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నిర్వహణ సజావుగా సాగేందుకు 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, ఇతర పోలింగ్ అధికారులు 514 మందిని కేటాయించారు.ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Sthanikam

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తి

Article Image

మున్సిపాలిటీ వార్డు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సాధారణ పరిశీలకులు గౌతమి సమక్షంలో జరిగింది.ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ సిబ్బంది కేటాయింపు చేపట్టారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగేలా అదనపు కలెక్టర్, సాధారణ పరిశీలకులు నిశితంగా పర్యవేక్షించారు.జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న వార్డు ఎన్నికల పోలింగ్ విధులకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.

జిల్లాలో మొత్తం 104 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నిర్వహణ సజావుగా సాగేందుకు 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 257 మంది, ఇతర పోలింగ్ అధికారులు 514 మందిని కేటాయించారు.ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News