మున్సిపల్ నామినేషన్లు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ హనుమంత రావు
మున్సిపల్ నామినేషన్లు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ హనుమంత రావు
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు ఆదేశించారు.
భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్ మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాలను కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కౌంటర్లు, హెల్ప్డెస్క్, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని తెలిపారు. అన్ని పత్రాలు సమగ్రంగా ఉన్నప్పుడే నామినేషన్లు స్వీకరించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి