Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:40 PM

మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ

మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ

మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ
02-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పారదర్శకత, నిష్పక్షపాతతే లక్ష్యం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు.

సోమవారం యాదాద్రి రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పనులను జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో, అందులో ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపసంహరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఇప్పటివరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన పార్టీ ఫారాలు సమర్పించారా అనే అంశాన్ని పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులకు అక్షర క్రమంలో ఎన్నికల గుర్తులు కేటాయించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగాలని స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ

Article Image

పారదర్శకత, నిష్పక్షపాతతే లక్ష్యం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు.

సోమవారం యాదాద్రి రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పనులను జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో, అందులో ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపసంహరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఇప్పటివరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన పార్టీ ఫారాలు సమర్పించారా అనే అంశాన్ని పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులకు అక్షర క్రమంలో ఎన్నికల గుర్తులు కేటాయించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగాలని స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News