మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ
మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్ పర్యవేక్షణ
స్థానికం బృందం
పారదర్శకత, నిష్పక్షపాతతే లక్ష్యం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు.
సోమవారం యాదాద్రి రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పనులను జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో, అందులో ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపసంహరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఇప్పటివరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన పార్టీ ఫారాలు సమర్పించారా అనే అంశాన్ని పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులకు అక్షర క్రమంలో ఎన్నికల గుర్తులు కేటాయించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి